అరుదైన గౌరవం దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్..!

కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం అరుదైన గౌరవం దక్కింది.. ప్రముఖ సినీ నటుడిగా యువరత్న గా గుర్తింపు పొందిన పునీత్ రాజకుమార్ కు కర్ణాటక రత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలనే ఆలోచన ఉందని , దీనిపై అధికారులతో చర్చించి , త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పేర్కొన్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పునీత్ కు గతంలోనే కర్ణాటక రత్న పురస్కారం ఇవ్వాలి అని పెద్ద ఎత్తున సూచనలు, సలహాలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు..

ఇకపోతే ఎంతోమంది అనాధలను ఆదరించిన పునీత్ కు ఇలాంటి పురస్కారాలు అందించిన చాలా తక్కువ. 1800 మంది పేద విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు ఇలా ఎన్నింటినో ఆయన దత్తత తీసుకుని తాను సంపాదించిన డబ్బులు వీరికి ఇస్తూ అందరికీ అండగా నిలిచాడు.. ఇక సమాజ సేవ చేస్తున్నందుకు గాను ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో పురస్కరించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇకపోతే పునీత్ సేవాగుణం ముందు పద్మశ్రీ ఇచ్చినా అది తక్కువే అవుతుంది అని ఆయన అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.