నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెలలోనే విడుదల చేయాలనుకున్నారు.
అయితే కరోనా మహమ్మారి దెబ్బకు విడుదల వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ, మేకర్స్ రిలీజ్ డేట్ను మాత్రం ప్రకటించడం లేదు. దాంతో అఖండ విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉండడంతో.. నందమూరి అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు.
ఇక మొన్నటి దాకా నవంబర్లో అఖండ విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. డిసెంబర్ 24కు అఖండ షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఇదైనా నిజమో..కాదో..తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనుండగా.. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.