పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కు జోడీ నిత్యా మీనన్ నటిస్తోంది.
ఈ మధ్యే ఓ స్పెషల్ పోస్టర్ రూపంలో చిత్రాన్ని ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో రానా సరసన నటించే హీరోయిన్ ఎవరు..? అన్న వార్త ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతుండగా.. తాజాగా అది నేనే అంటూ మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ మ్యాటర్ లీక్ చేసి మేకర్స్కు బిగ్ షాక్ ఇచ్చింది.
నిత్యా మీనన్ను అనౌన్స్ చేసినట్టే సంయుక్తను సైతం ఓ పోస్టర్ రూపంలో మేకర్స్ అనౌన్స్ చేద్దామని అనుకున్నారు. కానీ, ఇంతలోనే సంయుక్త.. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇందులో రానాకి జోడీగా నటిస్తున్నానని చెప్పేసింది. ఇక ఈ క్రేజీ అప్డేట్పై పవన్, రానా ఫ్యాన్స్ ఖుషీగానే ఉన్నా.. మేకర్స్ మాత్రం గుర్రుగా ఉన్నారని టాక్ నడుస్తోంది.
https://twitter.com/SamyukthaaMenon/status/1444262061261815812?s=20