టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవక ముందే వీరి వివాహ బంధానికి ఎండ్ కార్డు పడటంతో.. సామ్-చైల డివోర్స్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.
అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చై-సామ్ విడాకుల గురించి చర్చలు జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది సామ్పైనే రకరకాల నిందలు వేస్తూ ఆమెను మానసికంగా కృంగదీసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత ఓ పోస్ట్ రూపంలో తన ఆవేదనను వ్యక్త పరిచింది.
`మహిళలు ఏదైనా చేస్తే ఈ సమాజం ఎల్లప్పుడూ నైతికతతో కూడిన ప్రశ్నలు వేస్తుంటుంది. అదే పని మగవాళ్లు చేస్తే ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా..?` అంటూ ఓ కొటేషన్ను ఇన్స్టాలో పంచుకుంది. ఈ పోస్ట్ బట్టీ చూస్తుంటే..సమంత ప్రస్తుతం ఎంత వేదన అనుభవిస్తుందో స్పష్టంగా అర్థం అవుతోంది.