టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా గుడికెళ్లి అక్కడి అమ్మవారికి `విస్కీ` సమర్పించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం ఆర్జీవీ వరంగల్కు చెందిన రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవితం ఆధారంగా `కొండా` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్ వెళ్లాడు. ‘కొండా’ మూవీ ప్రారంభోత్సవంలో భాగంగా ఆర్జీవి అక్కడి గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాడు.
అలాగే అక్కడ ఆచారాల ప్రకారం వర్మ మైసమ్మకు మద్యం అందించారు. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన వర్మ.. `నేను వోడ్కా మాత్రమే తాగుతాను. కానీ మైసమ్మకు మాత్రం విస్కీ తాగించాను` అంటూ కామెంట్ కూడా పెట్టాడు. దాంతో వర్మ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.