ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఆ రోజున ప్రభాస్ 25వ చిత్రం అప్డేట్..

బాహుబలి సినిమా తో ఓవర్ నైట్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా మూవీలోనే చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలతో పాటు గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరొక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక రాధేశ్యామ్ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదలకు సిద్ధమవుతోంది. మిగిలిన చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక నాగ అశ్విన్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో ఇంకా మొదలు కావాల్సి ఉంది తాజాగా ఇప్పుడు ప్రభాస్ 25 వ చిత్రానికి సంబంధించి త్వరలో విడుదల కానుంది. అది ఏ రోజున అంటే అక్టోబర్ 7వ తేదీ. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన ఉండనుంది.

టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో ఎవరు చేయలేని సాహసం చేశారని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ తో ఈయన తెరకెక్కిస్తున్న మూవీ గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.