నాట్యం సినిమాకి గెస్ట్ గా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు తెలుసా..?

సంధ్య రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫిలిం పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు సంధ్య రాజు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాని ఫ్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రం రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరు కాబోతున్నట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడం జరిగింది

ఈ సినిమాని అక్టోబర్ 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఫ్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరుగుతున్నది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువ హీరోలే రిలీజ్ వేడుకకు అత్యధికంగా హాజరవుతున్న గమనార్హం. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ తన హవా కొనసాగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు.