మైక్ టైసన్ కోసం వాయిస్ అందించడానికి సిద్ధమవుతున్న బాలయ్య..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. స్టార్ హీరోయిన్ ఛార్మీ నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం లైగర్.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు ధీటుగా బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ నటిస్తున్నాడనే విషయం అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్ విలన్ గా నటించే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇకపోతే ఈ సినిమాలో మైక్ టైసన్ నటిస్తున్నాడు అనగానే అంచనాలు రెట్టింపు అవుతున్న నేపథ్యంలో మరోసారి ఇతడికి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.. అనడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి..

అయితే బాలయ్య డబ్బింగ్ చెప్పడం ఏంటి అని షాక్ అవచ్చు కానీ.. పూరి జగన్నాథ్ -బాలకృష్ణ కాంబోలో వచ్చిన పైసా వసూల్ సినిమా చనువుతో పూరి జగన్నాథ్ బాలయ్యతో విలన్ కి వాయిస్ డబ్బింగ్ చేయాలని అడిగినట్లు సమాచారం. ఇక అందుకు బాలయ్య కూడా ఓకే అన్నట్టు సమాచారం.. ఇదే నిజమైతే ఈ సినిమాకు బాలయ్య బాబు వాయిస్ కూడా ఒక పెద్ద అసెట్ అవుతుందని చెప్పవచ్చు.