కోలుకున్నాను.. ఇండియాకి తిరిగి వచ్చేసాను.. సిద్ధార్థ్?

టాలీవుడ్ హీరో సిద్దార్థ్ కు వెన్నెముక కు గాయం అయిన విషయం తెలిసిందే.అయితే సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.మహా సముంద్రం మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా సిద్దార్థ్‌ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ దర్శకడు అజయ్‌ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇందులో ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్‌ కు గాయం అవడంతో సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన సిద్దార్థ్‌ ఇటీవల తిరగి ఇండియా వచ్చారట.ఈ సందర్బంగా సిద్దార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ తాను ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్‌లో మహా సముంద్రం సినిమాలో తన డబ్బింగ్‌ చెబుతున్నానని పేర్కొన్నాడు.ఈ సినిమా రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అని అన్నాడు. ఇక తన స్పైన్‌ సర్జరీ బాగా జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పాడు. అయితే డాక్టర్లు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపాడు. అలాగే తనకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులకు ఈ సందర్భంగా సిద్దార్థ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘మహా సముంద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది.