తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో వారం కొనసాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో నుంచీ ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో 15 మంది ఉన్నారు.
వీరిలో ఈ వారం యాంకర్ రవి, విజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, ప్రియ, జెస్సీ, హమీద, విశ్వ, మరియు లోబోలో నామినేట్ అవ్వగా.. ఐదో వారం ఈ తొమ్మిది మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారట. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయబోతోన్నారట. ఇక నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్లో లోబో, జెస్సీలే డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ నిజంగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీరిద్దిరికే మూడుతుందని ప్రచారం జరుగుతోంది.