వాక్సిన్ వేయించుకొని వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు అందరు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ ఈ అయినా గాని కొంతమంది మాత్రం వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. నవంబర్‌ 1 వ తేదీ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోని వారి రేషన్, ఫించన్ కట్ చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది.

ఈ విషయం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోవాలిసి ఉంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి త్వరగా వాక్సిన్ వేయించుకుంటే మంచిది.