ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `నాట్యం`. నిశృంకళ ఫిల్మ్ బ్యానర్పై సంధ్యారాజే స్వయంగా నిర్మించిన ఈ మూవీలో కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, భానుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం పాజటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా చూపించారు. దాంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నాట్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా చూసిన బాలయ్య.. నాట్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మట్లాడుతూ..`నాట్యం సినిమా కాదు ఒక కళాఖండం. సినిమా కేవలం వినోదం కోసమే కాదు..దాని వెనక ఒక సందేశం.. మరుగున పడుతున్న కళకు తిరిగి జీవం పోసి భావితరాలు అందించిన ఘనత సంధ్యారాజు కు చెందుతుంది.దర్శకుడు రేవంత్ తాను అనుకున్న కథని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నటులంతా తమతమ పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశం రక్తికట్టించేలా ఉంది.` అంటూ పొగడ్తల వర్షం కురిపించారు బాలయ్య.