అసలేం జరిగింది.. ఈ నెల 22న తెలుస్తుంది!!

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం `అసలేం జరిగింది`. ఎన్వీఆర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. `తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనళల‌ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం.

ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. పూర్తి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది` అంటూ చెప్పుకొచ్చారు.