బుల్లితెరపై హాట్ యాంకర్గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకున్న అందాల భామ అనసూయ భరధ్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టీవీ షోలతో పాటుగా పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.
అలాగే తమిళంలో విజయ్ సేతుపతితో ఓ చిత్రం, మలయాళంలో మమ్ముటి తో ఓ చిత్రం కూడా అనసూయ చేస్తోంది. మొత్తానికి వరుస షూటింగ్లతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. మరోవైపు సోషల్ మీడియా వేదికాలో అందాలను పదర్శించడంలోనూ దూసుకుపోతోంది.
తాజాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ టాప్ను ధరించిన అనసూయ.. కిర్రాక్గా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం హీట్ పుట్టిస్తున్న అనసూయ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్స్లో కొందరు మాత్రం అనసూయపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. టాప్ వేసుకుని ప్యాంట్ మరచిపోయిందంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ అనసూయ తాజా లుక్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పాలి.