బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టగా.. తొలి వారం సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్ హాట్ సాగినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా మొదటి వారంలో చాలా సైలెంట్గా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారంలో మాత్రం తన ఉగ్రరూపం చూపించేసింది. లోబో, హమీదా ఫేక్ అంటూ వారిద్దరిపై విరుచుకు పడింది. తాజాగా విడుదలైన ప్రోమోలో అంతా శ్వేతానే ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక లీకువ వీరుల సమాచారం ప్రకారం.. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్లోకి వచ్చారని తెలుస్తోంది. మరి ఈ ఏడుగురిలో రెండో వారి మూడేదెవరికో తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.