భర్తతో విడాకులుపై క్లారిటీ ఇచ్చిన శిల్పాశెట్టి?

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత అతను బెయిల్ కోసం రెండు మూడు సార్లు అప్లై చేయగా రిజెక్ట్ చేసిన కోర్టు ఫైనల్ గా అతనికి బెయిల్ ను మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అరెస్టయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ఇక ఆ క్షణం లో శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. అలాగే ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు కూడా అనేక అనుమానాలకు దారి తీశాయి. దీనితో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడి పోతుంది అన్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

ఈ విషయంపై స్పందించిన శిల్పాశెట్టి తన భర్త నుంచి విడిపోవడం లేదని, తామిద్దరం ఎప్పటిలాగే అన్యోన్యంగా కలిసి ఉంటామని, ఈ మధ్య జరిగిన కొన్ని ఊహించని పరిణామాలు వల్ల తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాశెట్టి. భర్త నుంచి విడిపోవాలి అనే ఆలోచన వలనే శిల్పాశెట్టి బాలీవుడ్ లో బిజీ అవ్వాలి అనుకుంటుందని వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి. బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ కుంద్రా తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే తన భర్త అరెస్ట్ అయిన తర్వాత శిల్పా తన వాల్యూ తో పాటు ఆదాయం కూడా కోల్పోయింది. ప్రస్తుతం వాటన్నింటిని పెంచుకునే పనిలో పడింది శిల్పాశెట్టి.