సెన్సార్ పనులు ముగించుకున్న సీటీమార్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ ఈ సినిమా ఖచ్చితంగా విజయం అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు ఇద్దరు కూడా కబడ్డీ జట్టు కెప్టెన్‌లుగా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులను చిత్ర యూనిట్ తాజాగా పూర్తి చేసుకుంది. సీటీమార్ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా ఆస్వాదిస్తారని సెన్సార్ బోర్డు సభ్యులు వెల్లడించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు కోచ్‌లుగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి సెన్సార్ పనులు ముగించుకున్న సీటీమార్ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సినిమాను సంపత్ నంది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.