మ‌హేష్‌ను రిక్వస్ట్ చేసిన రాజ‌మౌళి..మరి వెన‌క్కి త‌గ్గుతాడా?

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ను అక్టోబర్ 13న విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ..ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు అనుకూలించ‌డం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది.

RRR New Poster Out Ram Charan, Jr NTR Enjoy Bike Ride As Film

ఈ నేప‌థ్యంలోనే రాజమౌళి.. మహేష్ బాబుని రిక్వస్ట్ చేసే పనిలో పడ్డట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సర్కార్ వారి పాట చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఆ తేదీన ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడ‌ట‌. రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే. ఆ చనువుతోనే జ‌క్క‌న్న‌ మహేష్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. మ‌రి రాజ‌మౌళి కోరిక మేర‌కు మ‌హేష్ వెన‌క్కి త‌గ్గుతాడో లేదో చూడాల్సి ఉంది.

Sarkar Vari Pata First Look Glimpse | Keerthy Suresh | Parasuram | #HBDMaheshBabu | ISPARKMEDIA | - YouTube

కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్ర‌మే `స‌ర్కారు వారి పాట‌`. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీని సంక్రాంతికి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.