యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` ను అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించినప్పటికీ..ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే రాజమౌళి.. మహేష్ బాబుని రిక్వస్ట్ చేసే పనిలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. సర్కార్ వారి పాట చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఆ తేదీన ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే. ఆ చనువుతోనే జక్కన్న మహేష్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి రాజమౌళి కోరిక మేరకు మహేష్ వెనక్కి తగ్గుతాడో లేదో చూడాల్సి ఉంది.
కాగా, మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే `సర్కారు వారి పాట`. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని సంక్రాంతికి కానుకగా 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.