ప్రభాస్ తీయవలసిన సినిమాని గోపీచంద్ తీసి హిట్ కొట్టాడు..?

తొలివలపు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు హీరో గోపీచంద్.ఇక ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య దర్శకుడు గా వహించారు.ఈ సినిమాకి గోపీచంద్ సొంత బ్యానర్ లో నిర్మించడం జరిగింది.ఈ సినిమా వల్ల విరు చాలా నష్టపోయారు.ఇక ఆ తరువాత గోపీచంద్ ఫ్యామిలీ లో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అయిన వాళ్ళు అంతా దూరమైపోయారు పైగా అప్పుల ఊబిలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది.

ఇక గోపీచంద్ చేసేది ఏమీ లేక సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి క్యారెక్టర్ చేయడానికైనా ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్న క్యారెక్టరే జయం సినిమాలో విలన్ గా అవతారమెత్తాడు.వాటితో అప్పులు తీర్చే చేశాడు గోపిచంద్.ఇక ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మారడం జరిగింది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి విజయాన్ని అందుకుంది.

Watch Yagnam | Prime Video

అయితే ఈ సినిమాని ముందుగా హీరో గోపీచంద్ కి అనుకోలేదట..ఈ సినిమాని దర్శకుడు బి.గోపాల్ ప్రభాస్ తో తీయాలనుకున్నారు.కానీ ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారికి ఈ కథ వినిపించడం ఆయన ఓకే అనడం జరిగింది.కానీ అప్పటికే ప్రభాస్ అడవిరాముడు వంటి సినిమాలకు కమిట్ అవ్వడం తో యజ్ఞం సినిమాను నో చెప్పేశాడు.దాంతో ఈ సినిమా గోపీచంద్ కు కలిసొచ్చింది.