మరొక కేసులో టాలీవుడ్ నటులు 38 మంది పై కేసు..?

గత రెండు సంవత్సరాల కిందట హైదరాబాద్ లో ఒక అత్యాచారం జరిగింది.అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, నటుడు రవితేజ,హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్.తో సహా మరొక 38 మందిపై కేసు నమోదయింది.అలా ఎందుకు చేశారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

 

ఆ అత్యాచారం జరిగిన బాధితురాలి పేరును బయట పెట్టడం చేత వీరందరిని అరెస్టు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గౌరవ్ గులాటి.అదే సమయంలో.. సెక్షన్ 228 A కింద ప్రముఖుల పై కేసు నమోదు చేయాలని సబ్జా మండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గౌరవ్.

ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇక ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్,ఫరాన్ అక్తర్,షేర్ సహా టాలీవుడ్ నటుడు రవితేజ, అల్లు శిరీష్,హీరోయిన్ ఛార్మి పేర్లను కూడా నమోదు లో పేర్కొన్నారు గౌరవ్. ఇక హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు.