టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లను ఎన్ని సంవత్సరాలు గడిచిన ప్రేక్షకులు మరువలేరు. ఎందుచేతనంటే వారి నటనతో ప్రేక్షకులను అంత బాగ ఆకట్టుకున్నారు.ఇక అలాంటి వారిలో నటి లక్ష్మి కూడా ఒకరు.ఈమె అసలు పేరు యార్రగుడిపాటి వెంకట మహాలక్ష్మి.ఈమె 1968 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోల సరసన నటించింది. లక్ష్మి రియల్ లైఫ్ లోకి వస్తే ఎన్నో చేదు అనుభవాలని ఎదుర్కొన్నట్లుగా తెలియజేసింది. తన మూడు పెళ్లిళ్లు వెనక కొన్ని సంఘటనలు ఉన్నాయి అన్నట్లుగా తెలియజేసింది. తన మొదటి భర్త తనకు ఇష్టం లేకపోయినా.. 15 సంవత్సరాల వయసులో భాస్కర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నదట. ఇక దాదాపుగా ఆయనతో 5 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయింది.
ఇక అనంతరం మోహన్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది.ఆ తరువాత ఆయనకు కూడా 1980 సంవత్సరంలో విడాకులు ఇచ్చింది.ఇక రెండు సార్లు విడాకులు తీసుకున్న తర్వాత.ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి శివ చంద్రన్ అనే నటుడిని వివాహం చేసుకున్నది.ఈమె చేసుకున్న మూడు పెళ్లిళ్ల విషయంపై ఆమెను పలుసార్లు పలువురు ప్రశ్నలు అడగగా.. అందుకు సమాధానంగా ఆమె.. ఒకరు తక్కువ, నేను ఎక్కువ అని అహం చూపిస్తే నాకు ఏమాత్రం నచ్చదు.అంతే కాకుండా మగవాళ్ళు చూపించే గర్వం అధికారం అందుకు గల ముఖ్య కారణమని ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం శివ చంద్రం తో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.