టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన ఎక్కువగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక స్టార్ హీరో అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం దూకుడు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో బ్రహ్మానందం, సోను సూద్, ఎమ్మెస్ నారాయణ, ప్రకాష్ రాజ్ నటించారని చెప్పుకోవచ్చు.ఈ సినిమా సెప్టెంబర్ 23న 2011న విడుదలై ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. అంటే ఈ సినిమా విడుదలై ఇప్పటికి 10 సంవత్సరాలు కావస్తోంది.
దాదాపుగా అప్పట్లోనే 1800 స్త్రీలపై ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించాడు.ఈ సినిమాని 35 కోట్లు రూపాయలు పెట్టి తీయగా ఈ చిత్రానికి..57.4 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఇక అంతే కాకుండా 101 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఉంది. అంటే దాదాపుగా 76 కోట్ల రూపాయల మేరకు లాభం వచ్చినట్లు. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా అప్పటివరకు నెలకొంది.
ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు కావస్తున్నా సందర్భంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఈ సినిమా మరొక సారి థియేటర్లు విడుదల చేయబోతున్నారు.