తెలుగులో కూడా బిజీ అవుతున్న హీరో ధనుష్?

తమిళ నటుడు హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లలో కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. అలాగే తమిళంలో అగ్ర హీరోగా చలామణి అవుతున్నారు. హీరో ధనుష్ తెలుగులో కూడా బిజీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది.

ఇక ఇది ఇలా ఉంటే ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతి తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమాతో పాటుగా,డివివి దానయ్య రూపొందించబోయే సినిమాలో నటించబోతున్నారట. ఇక సినిమాల స్క్రిప్ట్ ను బట్టి ఏది ముందు ఏది వెనుక అనేది తెలియాల్సి ఉంది. అయితే ధనుష్ ఫొకస్ మొత్తం టాలీవుడ్ పై పడినట్లే. ఓకే మీద టాలీవుడ్ సినిమాలు సక్సెస్ అయితే కోలీవుడ్ వదిలేసి టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తాడేమో!