కరీనా కపూర్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు ఎయిర్పోర్టులో ఒక చేదు అనుభవం ఎదురయింది. ఆమె తన కుటుంబంతో కలిసి పర్యటనకు వెళుతున్న సమయంలో, ముంబై ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా ఇటీవల ఒక సారి బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ను సైతం సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారి అడ్డుకొని పాస్ పోర్ట్ అడిగిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం అందరికి తెలిసిందే. బుధవారం కరీనా తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు.

ఈ సందర్భంగా భర్త సైఫ్ అలీ ఖాన్ కుమారుడు తైమూర్,జహంగీర్ తో కలిసి ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కరీనా ఇద్దరు పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా విమానాశ్రయంలో కి వెళ్లారు. కానీ కరీనాకపూర్ అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు వెనకే ఉండిపోయారు. అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కేర్ టేకర్ ను అడ్డుకుని పాస్ పోర్ట్ అడగగా, వారితో మాట్లాడేందుకు వచ్చిన కరీనా ను కూడా వారు పాస్ పోర్ట్ అడగడంతో ఆమె చూపించింది. వారు చెక్ చేస్తుండగా ఆమె వెనకాలే ఉన్నవారి మేనేజర్ కు ఆమె పాస్ పోర్ట్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే విమానాశ్రయంలో కి వెళ్లిన సైఫ్ అలీ ఖాన్ వెనక్కి వచ్చి కరీనా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఈ వీడియోని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు అని చూడకుండా తమ బాధ్యతలు నిర్వహించిన సెక్యూరిటీ ఆఫీసర్ లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.