మళ్లీ ఆచార్య సెట్లో చిరు, చెర్రీ.. ఈసారి ఎందుకంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో, చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలుపెట్టారు.ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తికావడంతో శంకర్ తో కలిసి పాన్ ఇండియా మూవీ ని మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ మళ్లీ ఆచార్య షూటింగ్ లో పాల్గొన్న పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో, రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఆచార్య సినిమాలో రెండు పాటల చిత్రీకరణ కొరటాల శివ వాయిదా వేశారట. దీంతో ఆ రెండు పాటలను తిరిగి సూట్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు, ఇందుకోసం హైదరాబాదులోని శివార్లలో ప్రత్యేకంగా సెట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక సాంగ్ చరణ్, చిరు లపై షూటింగ్ నిర్వహించనున్నారు. మరొక పాటను పూజా హెగ్డే అలాగే రామ్ చరణ్ లపై జరగనుందని, వచ్చే వారం ఈ పాట షూటింగ్ జరుగనున్నట్లు సమాచారం. ఈ రెండు పాటలను పూర్తిచేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోందట.