మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొద్ది నెలల నుంచీ సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఇటీవలె తన ప్యానల్ను ప్రకటించిన మంచు విష్ణు.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాలయ్యకు తనకు ఫోన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా చొరవతీసుకుని ఒక మంచి వ్యక్తిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారేమో అని ఎదురుచూశా. కానీ ఇక ఎన్నిక ఏకగ్రీవం కావట్లేదు అని గ్రహించాక తాను కూడా బరిలోకి దిగినట్లు మంచు విష్ణు తెలిపాడు.
బాలకృష్ణ లాంటి వ్యక్తి ఎన్నికల నుంచి తప్పుకోమని అడిగితే తప్పుకుంటా. కానీ బాలకృష్ణ అంకుల్ స్వయంగా నాకు ఫోన్ చేశారు. మంచి డెసిషన్ తీసుకున్నావు తమ్ముడు.. నేనున్నా.. ధైర్యంగా ముందుకెళ్లు అని అన్నారంటూ చెప్పుకొచ్చాడు. దాంతో విష్ణు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.