బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ముంబై లోని హిరానందాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించని అరుణ భాటియా బుధవారం మరణించడం జరిగింది. తల్లి మరణ వార్తను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు.
`నాకు సర్వం మా అమ్మే. ఇవాళ ఆమె కన్నుమూసింది. మరో లోకంలో ఉన్న మా నాన్నను తిరిగి కలిసేందుకు వెళ్లిపోయింది. మా అమ్మ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు… ఓంశాంతి` అని ట్విట్టర్లో పేర్కొంటూ అక్షయ్ ఆవేదనకు గరయ్యారు. మరోవైపు అరుణా భాటియా మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.