`రాజావారు రాణిగారు` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం.. రెండో చిత్రమే `ఎస్ఆర్ కళ్యాణ మండపం`. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషించారు.
ఆగష్టు 6న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసింది. సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లో విడుదలైన ఫస్ట్ హిట్ చిత్రం ఇదే. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతుందట.
ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆగస్ట్ 27న ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమాను స్ట్రీమింగ్ కూడా చేయబోతున్నారట. దీనిపై త్వలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.