పవన్‌ను చూసి నవ్వుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమన్నారంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యా్ప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనపై కామెంట్ చేయాలంటే ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను చూస్తే పిచ్చ కామెడీగా అనిపించిందని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూస్తూ పవన్ ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో మండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వారు కూడా ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఈ సంగతేమిటో చూద్దామా.

తెలుగులో తెరకెక్కుతున్న ‘మేజర్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న శోభితా ధూలిపాలి తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితురాలే. గతంలో అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రంలో కూడా ఆమె నటించింది. ఇప్పుడు మేజర్ చిత్రంలో కూడా ఆమె నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే పవన్ కళ్యాణ్‌పై ఆమె ఇలాంటి కామెంట్ ఎందుకు చేసిందనే విషయానికి వస్తే.. ఆమె పవన్ నటించిన ‘తమ్ముడు’ చిత్రాన్ని మరోసారి చూసిందట. ఈ సినిమాలో పవన్ చేసిన కామెడీ చూస్తూ ఆమె కడుపుబ్బా నవ్విందట. ఇంతలా ఇప్పుడున్న హీరోలు కామెడీ చేయడం తాను చూడలేదన, కామెడీ చేయడంలో పవన్‌కు సాటి మరెవరూ లేరని ఆమె తెలిపింది.

అసలు విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు కూడా తమ్ముడు చిత్రం పవన్ కెరీర్‌లో ఒక బెస్ట్ మూవీ అని, ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా పవన్ గురించి కామెంట్ చేసిన శోభితా ధూలిపాలికి తమ్ముడు చిత్రాన్ని మరోసారి గుర్తుకు చేసినందుకు పవన్ ఫ్యాన్స్ థ్యాంక్స్ కూడా చెబుతున్నారు.