సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా..?

ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య తో కలసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, స్టార్ హీరోలతో కూడా కలసి నటించింది. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈమె హీరో లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఇలాంటి సినిమాలో శాకుంతలం లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా భరతుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అల్లు అర్హ కు సమంత అన్ని దగ్గరుండి చూసుకోవడం తో , అల్లు అర్జున్ అలాగే అల్లు స్నేహ లు కూడా సమంతకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే ఈమె అటు సినిమాలలోనూ ,ఇటు వెబ్ సిరీస్ లో బిజీగా ఉండడంతో తనకంటూ కొంచెం సమయాన్ని కూడా కేటాయించుకోలేక పోతోందట. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు సినిమాలతో బిజీగా ఉండడంతో సినీ ఇండస్ట్రీకి దూరం కావాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే తనకోసం కొంతకాలం కేటాయించుకోవడం కోసం మాత్రమే , తను సినీ ఇండస్ట్రీకి గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఎప్పుడు సినిమాల్లోకి రావాలని అనిపిస్తే, అప్పుడే వస్తాను అని కూడా స్పష్టం చేసిందట సమంత. అయితే ఈ వార్త విన్న సమంత అభిమానులకు కొంచెం షాక్ తగిలింది అని చెప్పవచ్చు