తాజాగా సాయి పల్లవి మరో క్రేజీ రికార్డ్ను సెట్ చేసింది. ఇప్పటికే రౌడీ బేబీ, ఫిదాలోని వచ్చిండే.., ఎంసీఏ పాటలతో యూట్యూబ్లో అనేక రికార్డును నెలకొల్పిన ఈ భామ.. ఇప్పుడు `సారంగ దరియా..` సంచలనాలను సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్స్టోరీ. శేఖర్ కమ్మలు దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంటాయి.
అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన `సారంగ దరియా’ సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ఆలపించగా.. ఫిబ్రవరిలో విడుదలైంది. ఇక అప్పటి నుంచి ఈ జానపద గేయం యూట్యూబ్లో దుమ్ము దులిపేస్తోంది.
తాజాగా ఈ సాంగ్ ఏకంగా 300 మిలియన్ల మార్క్ను దాటేసింది. అతి తక్కువ సమయంలో ఓ లిరికల్ వీడియోకు ఇంత ఆదరణ లభించడం సౌత్లో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు.