పూజా హెగ్డే పై కామెంట్స్ చేసిన రోజా భర్త..!

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సీజన్ నడుస్తోంది. మన తెలుగులోనే కాకుండా తమిళం లో పాన్ ఇండియా సినిమాలకు రెడీ అవుతున్నారు నటీ నటులు. వీటిలో కొన్ని ముఖ్యమైన సినిమాలలో కామన్ హీరోయిన్ పూజ హెగ్డ్ నటించడంతో కొంత మంది ఆమెను పాన్ఇండియా స్టార్ అని అంటున్నారట. ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సినిమా లో తన అందాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాకుండా ఎంతో మంది హీరోలతో మంచి ఛాన్స్ లను కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఈమెకు రేంజ్ పెరిగాక పూజ హెగ్డే టెక్ చూపిస్తోందని, ప్రముఖ దర్శక నిర్మాతలు సెల్వమణి కొన్ని కామెంట్స్ ను చేశారట. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

పూజ హేగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో రాధేశ్యామ్,విజయ్, ప్రభాస్ లతో కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఇండస్ట్రీ మొత్తం తన చుట్టూ తిరుగుతోంది. ఈమె రేంజ్ పెరగడమే కాకుండా ఈమెకు అసిస్టెంట్స్ కూడా పెరిగి పోతున్నారట.

అప్పట్లో పూజ హేగ్డే కు ఒక అసిస్టెంట్ మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు మాత్రం ఆమె చుట్టూ 12 మంది అసిస్టెంట్లు ఉన్నారట. ఈ మాటలను ఆర్. కె సెల్వమణి అన్నారు. అంటూ బాలీవుడ్ లో ఈ మాటలు వినిపిస్తున్నాయి. పూజ చేస్తున్న పనుల వల్ల నిర్మాతల మీద పెద్ద భారం పడుతుందని చెబుతున్నారు. కొంతమంది.

హీరోయిన్ల రేంజ్ పెరిగాక వాళ్ల రెమ్యూనరేషన్ తో పాటే,వాళ్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటుంటారు. ఇలాంటి విషయాలు వేరే హీరోయిన్ల గతంలోనే చెప్తుంటే మనం విన్నాం.. అయితే పూజ హేగ్డే మాత్రం 12 మంది అసిస్టెంట్లు పెట్టుకొని నిర్మాతలకు గుండు కొట్టిస్తోంది అని అంటున్నారు. మరి దీనిపై పూజ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.