ఒక్కడు సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ గా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్ల ముందు క్యూ కడతారు. బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక సినిమా రాయలసీమ కర్నూల్ ప్రాంతంలో సూపర్ హిట్ గా నిలిచింది.. రాయలసీమ కర్నూల్ కోట అనగానే ముందుగా గుర్తుకు సినిమా ఒక్కడు.

అందులో లోగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఆ సినిమాతో మహేష్ బాబు స్టార్ స్టేటస్ ను కూడా రాత్రి రాత్రికే అమాంతంగా పెంచేసింది. అయితే, ఈ చిత్రం కథ విన్నప్పుడు అంతగా శ్రద్ధ పెట్టడం లేదట మహేష్ బాబు.ఇక ఈ విషయాన్ని ఈ సినిమా రైటర్.. తోటప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ విషయాన్ని వెల్లడించాడు.

మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కడు సినిమా ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు నిర్మాత ఎం.ఎస్.రాజు ,దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా కథను ఫైనల్ చేయటానికి మహేష్ బాబు దగ్గరికి వెళ్ళారు. కథ బాగానే ఉందని కామెంట్స్ చేసి నాకు కొద్దిగా టైం కావాలి అని తీసుకున్నాడు మహేష్ బాబు .

ఇక రోజులు గడుస్తున్నా కూడా మహేష్ బాబు ఏ సమాధానం చెప్పకపోవడంతో గుణశేఖర్ ఫోన్ చేసి నిర్ణయం అడుగుదాం అనుకున్నాడట. అయితే మహేష్ బాబు మేనేజర్ మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా మహేష్ బాబు ఏదో పనిలోఉన్నాడని అబద్ధం చెప్పేవాడట మహేష్ బాబు ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదట.

ఈ కథ మహేష్ బాబు కు నచ్చలేదేమోనని పవన్ కళ్యాణ్ కి చెప్పాలి అని అనుకున్నారట. అంతేకాకుండా వెంకటేష్ ని కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేశారట అని తోటి ప్రసాద్ తెలిపారు. అలాగే కొద్దిపాటి ఆలోచనతో గోపీచంద్ కు ఇవ్వాలని అనుకుంటున్నారు.కానీ వెంటనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక ఆలోచిస్తూ ఒకసారి ఫైనల్ గా మహేష్ బాబుకి ఈ కథ పై ఆసక్తి చూపడంతో సినిమాను పట్టా లెక్కించారు.