మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్ని లేని విధంగా ఈ సారి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన ప్యానెల్ కూడా ప్రకటించేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధులు పలు రకాలుగా ప్రచారాలు మొదలు పెట్టేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ కింగ్ నాగార్జున బర్త్డే(ఆగస్టు 29)ను ఎన్నికల క్యాంపెయిన్గా ఉపయోగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారట. వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ తన ఆఫీస్లో నాగ్ బర్త్డేని పురస్కరించుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం ఈ రోజు నైట్ పార్టీని ఏర్పాటు చేశారట.
ఈ పార్టీకి బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్స్ అందరూ హాజరు కావాలంటూ వాట్సప్ గ్రూప్లో సమీర్ ఇన్విటేషన్ పంపినట్టు కూడా సమాచారం. మరో విషయం ఏంటంటే..ఈ ఇన్విటేషన్లు నాగార్జునకు తెలియకుండానే పంపినట్లుగా తెలుస్తోంది. దాంతో నాగ్ పుట్టినరోజు వేడుకను వాడుకుని ఓటర్ల సమీకరణ చేయాలనేదే ప్రకాశ్ రాజ్ వ్యూహం అన్న ప్రచారం ఊపందుకుంది. కాగా, మా ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. అసలైన పోటీ మాత్రం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్యే నడుస్తోంది.