చ‌క్ర‌సిద్ధ్‌ సెంట‌ర్ ను మొదలు పెట్టిన మహేష్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో మ‌హేశ్ బాబు కూడా ఒకరు. ఒక పక్క సినిమాలు తీస్తూనే మరో పక్క పలు రకాల వాణిజ్య సంస్థల యొక్క ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తు నిత్యం మన అందరికి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు వాణిజ్య సంస్థల ఉత్పత్తులతో పాటు ప్రజల అందరికీ ఉపయోగపడే పురాత‌న కాలంనాటి సిద్ధ వైద్యాన్ని కూడా ప్ర‌మోట్ చేస్తున్నారు.

శంక‌ర్ ప‌ల్లి స‌మీపంలోని మోకిల అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చ‌క్ర‌సిద్ధ్‌ సెంట‌ర్ ను ఈరోజు మ‌హేశ్ బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ బాబు మాట్లాడుతూ ఇలా అన్నారు.. ఎంతో మంది ప్రజలు న‌యం కాని రోగాల‌తో బాధ‌ప‌డుతూ జీవిస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సెంట‌ర్ ను డాక్ట‌ర్ స‌త్య సింధూజ నేతృత్వంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

చ‌క్ర‌సిద్ధ నాడి వైద్యం చేయడంలో డాక్ట‌ర్ స‌త్య సింధూజ ఎంతో అనుభవం కలవారు. ఈ సిద్ధ వైద్యం అనేది నయం కానీ రోగాలకు ఒక అద్బుత‌మైన చికిత్స‌ అని, ఇలాంటి చికిత్స మన పురాతన కాలంనుంచి అందుబాటులో ఉంది. అలాంటి సంప్ర‌దాయ‌, ప్రామాణికమైన సిద్ధ వైద్యాన్ని నేను ప్ర‌మోట్ చేయ‌డం ఎంతో గర్వ కారణంగా ఉందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు, శాంతా బ‌యోటెక్నిక్స్ ఛైర్మ‌న్ కేఐ వ‌ర ప్ర‌సాద్ రెడ్డి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి,త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌, యాంక‌ర్ సుమ‌ దంపతులు కూడా వచ్చారు.