ఒకే కారులో మ‌హేష్‌, విజ‌య్ ద‌ళ‌ప‌తి..పిక్ వైర‌ల్‌!

ఒకే కారులో మ‌హేష్ బాబు, విజ‌య్ ద‌ళ‌ప‌తి ఎక్క‌డికి వెళ్లాడు..? అసలు వీరిద్ద‌రూ ఎప్పుడు క‌లిశారు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. మీ సందేహాల‌కు క్లారిటీ కావాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Sarkaru Vaari Paata first notice: Mahesh Babu looks stylish in first look,  movie to release on January 13 | Entertainment News,The Indian Express

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే మొన్నీ మ‌ధ్య ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. అందులో రెడ్ క‌ల‌ర్ కారు నుంచి దిగుతూ మ‌హేష్ సూప‌ర్ స్టైలిష్‌గా క‌నిపించాడు.

Image

అయితే తాజాగా కొంద‌రు క్రియేట‌ర్లు.. మ‌హేష్ దిగుతున్న కారులో విజ‌య్ ద‌ళ‌ప‌తి కూడా ఉన్న‌ట్టు ఎడిట్ చేసి సోష‌ల్ మీడియా పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ పిక్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేస్తూ అద్భుతంగా ఉంద‌ని కామెంట్ పెట్టారు. దాంతో ఈ ఫొటో మ‌రింత వైర‌ల్ అవుతుతోంది.