కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత వినయ విధేయ రామ మూవీలో కియారా నటించింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా.. బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉంటే.. కియారా బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడిపిస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. సిద్దార్థ్ తో రిలేషన్ గురించి మరియు తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సిద్దార్థ్ మంచి నటుడని తన పనిపై ఎప్పుడు ఫోకస్గా ఉంటాడంటూ అతడిపై ప్రశంసలు కురిపించింది. అలాగే తామిద్దరమూ మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ఇక పెళ్లెప్పుడు అని అడగగా, తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలియదు కానీ అరెంజ్డ్ మ్యారేజ్ మాత్రం చేసుకోనని ..ఎప్పటికైనా లవ్ మ్యారేజ్నే చేసుకుంటానని చెప్పుకొచ్చింది.