హీరోయిన్ స్నేహ పెళ్లి వెనుక ఇంత తుంతు జరిగిందా ?

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు. ఈమె పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నది. ఇక ఈ మధ్య కాలంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా నటిస్తూ , వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ హీరోయిన్. ఇక తాజాగా రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది స్నేహ.

అయితే స్నేహ మొదటి సారి గోపీచంద్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రాధాగోపాలం ,సంక్రాంతి వంటి సినిమాలతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె స్వస్థలం ముంబై. ఈమె అసలు పేరు”సుహాసిని రాజారామ్ నాయుడు”. సినీ రంగంపై ఉండే ఆసక్తి తోనే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిందట.ఇక ఈ విషయాలన్నింటినీ ఆలీతో జరిగిన కార్యక్రమంలో ఈమె పాల్గొని తెలిపింది.

ఈమె అప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. 2012 మే 11న తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్నట్లు అందరికీ తెలిసిందే. తనది ప్రేమ వివాహం అని చెప్పుకొచ్చింది. మొదట్లో తన భర్త స్నేహపై చాలా కోపంగా ఉండేవారట. ఎందుకంటే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో తన భర్త పక్కనే హీరోయిన్ గా నటించనని చెప్పడంతో ..తన భర్త తన పై కోపం వచ్చినట్లు తెలిసింది.

వీరి పెళ్లికి మొదట ఇద్దరు కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. కానీ స్నేహ తల్లిదండ్రులు ఒప్పుకున్నా, ప్రసన్న తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టిందట. అంతేకాకుండా ఒక సమయంలో చాలా గొడవలు కూడా జరిగినట్లు ఆమె తెలిపింది. ఇక ఎట్టకేలకు ఇద్దరం కలిసి ఒకటి అయ్యామని తెలిపింది స్నేహ. ప్రస్తుతం వీరికి ఒక పాప , ఒక బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీలో బిజీ గా ఉంది.