ఒకేరోజు థియేటర్ లో, ఓటీటీలో ఎన్నీ సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలు వరుసగా పోటీకి బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకేసారి పలురకాల సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుండగా, అదే రోజు సాయి పల్లవి, నాగచైతన్య నటించినలవ్ స్టోరీ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి ఓటీటీ లో విడుదల అవుతుండటంతో థియేటర్ లలో రిలీజ్ అయ్యే సినిమా లపై ప్రభావం పడుతుందని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు.

అలాగే సెప్టెంబర్ 10న విడుదల అయ్యేటట్టు జగదీష్ సినిమాపై కూడా ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఓ థియేటర్లకు మద్దతు ఇవ్వకుండా ఓటీటీ విడుదలపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు సమావేశం కానున్నారు. ఒకే రోజు విడుదల అయ్యే లవ్ స్టోరీ, అలాగే టక్ జగదీష్ సినిమాల వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చు అని థియేటర్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనితో టాలీవుడ్ లో మరో వివాదానికి తెరలేపినట్టు అయింది.