అల్లు అర్జున్తో `పుష్ప` సినిమాను చేస్తూ బిజీగా ఉన్న క్రియేట్ డైరెక్టర్ సుకుమార్.. తాజాగా మహేష్, పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` మూవీ సెట్లో దర్శనమిచ్చారు. మహేష్ను కలిసేందుకే షూటింగ్ స్పాట్కు వచ్చిన సుక్కు.. ఆయనతో చాలా సేపు మంతనాలు జరిపారు. వీరి మీటింగ్కు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్గా మారాయి.
ఇక ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న డౌట్ చాలా మందిలో మొదలైంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..వీరిద్దరూ ఓ కమర్షియల్ యాడ్ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ యాడ్ షూటింగ్ జరుగనుందని తెలుస్తోంది. ఆ యాడ్ షూట్కు సంబంధించే మహేష్, సుకుమార్ కలిశారని సమాచారం. కాగా, ఇప్పటికే వీరిద్దరి కలయికో `1-నేనొక్కడినే` చిత్రం వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమా తర్వాత మహేష్తో మరో సినిమా చేయాలని సుక్కూ భావించినా.. పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.