హీరోలంద‌రూ ఫారిన్ వెళ్తుంటే..చిరు వైజాగ్‌ వెళ్తున్నాడేంటీ?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత లూసీఫ‌ర్ రీమేక్‌, ఆ వెంట‌నే వేదాళం రీమేక్‌.. అనంత‌రం యంగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన చిరు.. తాజాగా వైజాగ్‌కు వెళ్లార‌న్న వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ చిరు ఉన్న‌ట్టు ఉండి వైజాగ్‌కు వెళ్ల‌డానికి కార‌ణం.. ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసమ‌ని తెలుస్తోంది. డీటాక్సిఫికేష‌న్, రెజువెనేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా వైజాగ్ లోని ఆయుర్వేదిక్ స్పా సెంట‌ర్‌కు చిరు వెళ్లార‌ని తెలుస్తోంది. అయితే నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రూ ఈ డీటాక్సిఫికేష‌న్ ప్రాసెస్ కోసం ఫారిన్ వెళ్తుంటారు.

కానీ, చిరు ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఫారిన్ వెళ్లే ప‌ని పెట్టుకోకుండా వైజాగ్ ను ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. కాగా, చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న ఆచార్య ష‌టింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది.