హీరో ధనుష్ అంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. రజనీ కాంత్ అల్లుడు అయిన ధనుష్ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అటువంటి హీరోకు హైకోర్టులో చుక్కెదురైంది. హీరో ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. హీరో ధనుష్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో ఈ వివాదం నెలకొంది. ఆ కారు కొన్న సమయంలో ట్యాక్స్ కన్షెషన్ ఇవ్వాలని 2015వ సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఆ సంవత్సరంలోనే ఖరీదైన రోల్స్ రాయిస్ కారును విదేశాలను నుంచి తెప్పించుకున్నాడు.
ఆ టైంలో ఆ కారు తీసుకొచ్చినందుకు ఇక్కడి అధికారులకు ట్యాక్స్ కట్టాలి. కానీ ధనుష్ మాత్రం కారు కొన్న సందర్భంగా తనకు ట్యాక్స్ తగ్గించాలని కోర్టుకు వెళ్లాడు. దీంతో మద్రాస్ హైకోర్టు ధనుష్ పై సీరియస్ అయ్యింది. అంత పెద్ద కారు కొన్న ధనుష్ కు ట్యాక్స్ కట్టడం పెద్ద విషయమేమీ కాదని, తనలాంటి వీఐపీలకు పన్ను కట్టడంతో చాలా చిన్న పని అని కోర్టు ప్రశ్నించింది. అందరిలాగే ధనుష్ కూడా ట్యాక్స్ కట్టి తీరాలని కోర్టు స్పష్టం చేయడంతో ధనుష్ కు షాక్ తగిలింది.