`మిష‌న్ ఇంపాజిబుల్` అంటున్న‌ తాప్సీ..!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్య‌టీ.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధ‌మైంది.

తాజాగా తాప్సీ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే మిష‌న్ ఇంపాజిబుల్‌. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించ‌బోతోంది. ఈ చిత్రంలో తాప్సీ పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుందని ప్రచారం జ‌రుగుతోంది. ఇక ఓ వైవిధ్యమైన క‌థ‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.