సురేష్ ప్రొడక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా..?

టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్ అనేది ఎంతో గొప్పది. చాలా మంది ఆర్టిస్టులను, సినిమాను ఆ సంస్థ ప్రజలకు అందించింది. ఆ బ్యానర్ లో సినిమా వస్తోంది అంటే అది కచ్చితంగా ఓ వినూత్న కథాంశంతో వస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. కొన్ని రోజులుగా కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతో సినిమాలు చేస్తూ ఎస్పీ ప్రొడక్షన్ దూసుకుపోతోంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

“మత్తు వదలరా” సినిమాతో కీరవాణి కొడుకు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఎంఎం కీరవాణి కొడుకు సింహా కోడూరి డిఫరెంట్ కథాంశాలతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఎస్పీ ప్రొడక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి “దొంగలున్నారు జాగ్రత్త” అనే పేరును ఖరారు చేశారు. నూతన దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటుగా గురు ఫిలిమ్స్ కూడా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది.