కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ షకీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది.
`కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన షకీలా.. ప్రస్తుతం కె.ఆర్ ప్రొడక్షన్ బ్యానర్లో అట్టర్ప్లాప్, రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు చిత్రాల్లో షకీలా కూతురు మిలా హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే రామానాయుడు స్టూడియోలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.