బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్..ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యాక్టర్స్లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈయన.. ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు.
ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్ను కొన్నాడట షాహిద్. షాహిద్, అతడి భార్య మీరా రాజ్పుత్లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారట. ఈ ఫ్లాట్ విషయానికొస్తే 42, 43 అంతస్థుల్లో ఈ డూప్లెక్స్, సీ ఫేసింగ్తో నిర్మించారు.
అత్యంత విలాసవంతమైన ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 56 కోట్లకుపైమాటే అనే జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ఇంటికి సమీపంలోనే అక్షయర్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి బడా తారలు నివాసం ఉంటున్నారట. కాగా, ఇటీవలే షాహిద్, మీరారాజ్పుత్, ఇషాన్ ఖట్టర్ కొత్తింటిని సందర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.