పూజా హెగ్డే జోరు..ధ‌నుష్‌కు కూడా ఒకే చెప్పేసింద‌ట‌?!

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ధునుష్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌తో త‌న తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయ‌న‌. ఈ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభించకముందే ధ‌నుష్ యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు ఊపందుకున్నాయి.

ఈ చిత్రం విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సాగ‌బోతోంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మ‌రో వార్త వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో ధునుష్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా అయ్యాయ‌ని టాక్‌.

కాగా, పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా.. కోలీవుడ్‌, బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈమె న‌టించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. ఆచార్య‌, రాధేశ్యామ్ చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి బీస్ట్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ధ‌నుష్‌కు కూడా ఒకే చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.