రీసెంట్గా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ పార్టీని వీడనున్నారాఅనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆమెకు కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు అస్సలు బయట కనిపించలేదు. ప్రచార టైమ్ లో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి జనసేన పార్టీ కండువా కూడా వేసుకున్నారు రత్నప్రభ. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు తెలిపిన ఆమె ఇప్పుడేమో వైస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆమె దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కు ఈ మాజీ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ రత్నప్రభ పెద్ద అభిమాని అని సమాచారం. బీజేపీలో జాయిన్ అయినప్పటికీ వారిపైనే పొగడ్తలు కురిపించిందనే టాక్ అప్పట్లో నడిచింది. ఇక ఈ కారణంగానే ఆమె చాలా విమర్శలు అప్పట్లో ఎదుర్కొన్నా.. కూడా ప్రస్తుతం ఆమె వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.