పవన్ సరసన నిత్య మీనన్…?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు. క‌రోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ ఊపందుకుంది. ప‌వ‌న్ త్వ‌రలోనే షూటింగ్‌కి హాజ‌రు కానున్నారు.

గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది ఎవరు అనే దానిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్యా మీన‌న్ ను ఫిక్స్ చేసినట్లు ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో నిజమెంత ఉంద‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పవన్ అభిమానులు వేయి కళ్లతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.