యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
బాక్సాఫీస్ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్కు వెళ్లబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో ఓ సినిమా చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా ఏదో కాదట.. జనతా గ్యారేజ్ రీమేక్నే అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం సల్మాన్కు మైత్రీ వారు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, 2023 లో ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.